జీరో అవర్ పై మాజీ మంత్రి హరీశ్ ఫైర్..! 1 y ago
TG: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ జీరో అవర్ నిర్వహించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సాక్షిగా అసెంబ్లీలో ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపించారు. అలాగే విపక్షంలో తమతో పాటు ఉన్న ఎంఐఎం పార్టీకి కూడా మంత్రులను ప్రశ్నలు అడిగేందుకు కనీస అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు.మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సైతం ఆన్లైన్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.